రెండు ఇసుక లారీలు, జేసీబీ సీజ్ | sand vehicles seized in mahabubnagar district | Sakshi
Sakshi News home page

రెండు ఇసుక లారీలు, జేసీబీ సీజ్

Oct 27 2015 9:15 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను ఉన్నతాధికారులు సీజ్ చేశారు. రాజాపూర్ గ్రామ సమీపంలోని వాగు నుంచి ఇసుకను తోడి తరలిస్తున్న రెండు లారీలను, ఒక జేసీబీని పోలీసులు పట్టుకున్నారు.

మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఉన్నతాధికారులు సీజ్ చేశారు. రాజాపూర్ గ్రామ సమీపంలోని వాగు నుంచి ఇసుకను తోడి తరలిస్తున్న రెండు లారీలను, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వాటిని బాలానగర్ పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై పదేపదే ఫిర్యాదులు అందుతున్నా స్థానిక ఎస్సై వాటిపై స్పందించలేదు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న పోలీసుల ప్రత్యేక బృందం ఇసుక తరలింపును అడ్డుకున్నారు. అక్రమార్కులపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement