రవాణా కార్మికులకు రూ.5 లక్షల బీమా | Rs 5 lakhs of insurance for Road transport workers | Sakshi
Sakshi News home page

రవాణా కార్మికులకు రూ.5 లక్షల బీమా

May 14 2015 1:25 AM | Updated on Aug 30 2018 5:54 PM

రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు తమ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 12 రూపాయలు చెల్లిస్తే..

హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల ఉప కార్మిక కమిషనర్లు
సాక్షి, హైదరాబాద్: రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు తమ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 12 రూపాయలు చెల్లిస్తే ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల కార్మికశాఖ ఉప కమిషనర్లు పి.శ్రీనివాస్, ఇ.హనుమంతరావు, ఎస్.నరేశ్ కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ మేడే రోజు నుంచి ఈ బీమా పథకం అమల్లోకి వచ్చిందన్నారు.

ప్రమాదవశాత్తు మృతి చెందితే ఐదు లక్షల రూపాయలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. దీనికి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల ట్రాన్స్‌పోర్టు కార్మికులు, డ్రైవర్లు అర్హులని అన్నారు. ఈ పథకంపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16వ తేదీన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ట్రేడ్ యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు కార్మికులు టోల్‌ఫ్రీ నంబర్ 180030708787కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement