పెండింగ్‌ కేసుల్ని పరిష్కరించండి

Resolve Pending cases Says Justice Raghavendra Singh - Sakshi

హైకోర్టు సీజే జస్టిస్‌ ఆర్‌.ఎస్‌ చౌహాన్‌

సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. బుధవారం హైకోర్టు నుంచి ఆయన అన్ని జిల్లాల జడ్జిలు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెరోపేరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ (ఐసీజేఎస్‌) సర్వీసులను ప్రారంభించారు. ఐసీజేఎస్‌ సర్వీసులను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ విధానం ద్వారా క్రిమినల్‌ కేసుల విచారణ కూడా పూర్తి చేసి పెండింగ్‌ కేసుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top