కరీంనగర్ సిటీ :
ప్రమాదాలకు ఆలవాలంగా మారిన రాజీవ్హ్రదారి పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. శుక్రవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ రాజీవ్ రహదారిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో లోపాభూయుష్టంగా ఉన్న ఈ రహదారిని రూ.750 కోట్లతో పునరుద్ధరించాలని నిర్ణయించారు. జిల్లాలో శనిగరం నుంచి గోదావరిఖని వరకు దాదాపు 117 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారి ఉంది. డబుల్ రోడ్డుగా ఉన్న రాజీవ్ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా మార్చారు. ప్రస్తుతం ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఈ పనుల పట్ల అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.
జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించడం లేదని, కనీసం మూలమలుపులు కూడా తొలగించడం లేదని, కేవలం రోడ్డును నాలుగు లేన్లుగా వెడల్పు చేస్తున్నారంటూ తెలంగాణవాదులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలమలుపులు ఎక్కడా తొలగించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి నిర్మాణ పనులపై అప్పట్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్రావు అధ్యక్షతన శాసనమండలి ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఈ ఉప సంఘం రహదారి వెంట పర్యటించి అనేక లోపాలు, అక్రమాలు ఉన్నట్లు నివేదిక ఇవ్వగా అది బుట్టదాఖలైంది. చివరకు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మూలమలుపులు తొలగించాలని, అందుకు అనుగుణంగా విస్తరించాలని సీఎం నిర్ణయించడంతో రాజీవ్హ్రదారి స్వరూపం మారనుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతంలో మౌలిక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కేంద్రంలో వాహన పార్కింగ్తో పాటు, సేద తీరడానికి వసతి కల్పిస్తారు.
రాజీవ్ రహదారి పునర్నిర్మాణం
Published Sat, Nov 1 2014 4:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement