రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు జరిగాయి.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ఎయిర్పోర్ట్ దారిలో బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. శంషాబాద్ను జిల్లాగా ప్రకటించకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయకులు హెచ్చరించారు.