కాళ్ల పారాణి ఆరకముందే.. | New of the bride sucide | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే..

May 24 2016 2:18 AM | Updated on Sep 4 2017 12:46 AM

కాళ్ల పారాణి ఆరకముందే..

కాళ్ల పారాణి ఆరకముందే..

కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు అత్తింటి వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది.

నవ వధువు బలవన్మరణం
సింగంపేటలో విషాదఛాయలు

 
 
 ఆత్మకూర్ : కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు అత్తింటి వేధింపులు భరిం చలేక బలవన్మరణానికి పాల్పడింది. వి వరాలిలా ఉన్నాయి. మండలంలోని సింగంపేటకు చెందిన రుచిత (19) ఆత్మకూర్‌లో డిగ్రీ సెకండ్ ఇయ ర్ పూర్తి చేసింది. గత నెల 25న అజ్జకోలుకు చెందిన అబ్బాయితో పెద్దలు వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన నరేష్‌ను ప్రేమిం చింది. దీంతో అదే నెల 23న ఆత్మకూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుని స్వగ్రామానికి వచ్చి ఆల యంలో దండలు మార్చుకున్నారు. అప్పటికే నరేష్‌కు వేరే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుం బాల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనంతరం పెద్దలు నరేష్‌కు రుచిత తల్లిదండ్రులు రూ.నాలుగు లక్షలు కట్నం ఇవ్వాలని తీర్మానించారు.

వెం టనే అత్తింటికి చేరుకున్న ఆమె మరుసటి రోజు జిల్లాకేంద్రంలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్  రాత పరీక్షకు హాజరైంది. అనంతరం కట్నం ఏమైం దని అత్త పార్వతమ్మ, మామ నర్సిములు వేధించసాగారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కాగా, ఈ ఘటనకు అత్తిం టివారే కారణమని మృతురాలి తండ్రి విష్ణుమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ సీహెచ్‌రాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

పోల్

Advertisement