ముస్లిం ఉద్యోగులకు ‘రంజాన్‌’ సడలింపులు!

Muslim Employees Can Leave Early During Ramadan Month In Telangana - Sakshi

సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లొచ్చు

సాక్షి, హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం ఉద్యో గులు ప్రార్థనలు, ఇతర ఆచారాల్లో పాల్గొన డానికి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి పనివేళల్లో ప్రత్యేక సడలింపులు కల్పించింది. ముస్లిం ఉద్యో గులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు తమ కార్యా లయాలు/పాఠశాలలను వదిలివెళ్లేం దుకు అనుమతి నిచ్చింది. ఈ నెల 7 నుంచి వచ్చే నెల 6 వరకు ఈ సడలింపులు అమల్లోకి ఉంటాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌.కె.జోషి సోమవారం సర్క్యులర్‌ జారీ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top