ఎంత పని చేశావు..
{పేమజంట ఆత్మహత్య
రైలు కింద పడి మృత్యువాత
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులే..
ఖమ్మం జిల్లాలో ఘటన
కరీమాబాద్లో విషాదం
‘‘అయ్యో దేవుడా! ఎంత పని చేశావు.. ఇరవై
ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం..
బాబు, పాప పుట్టగానే సంతోషించాం.. వారే
జీవితం అనుకుున్నాం.. బాగా చదువుకుని..
ప్రయోజకులు అవుతారనుకున్నాం.. ఇలా
అర్ధంతరంగా చనిపోతారనుకోలేదు..
ప్రేమ రూపంలో మృత్యువు వస్తుందను
కోలేదు.. మాకు కడుపుకోత మిగిల్చి..
దుఖఃసాగరంలో నెట్టారు..!’’ అంటూ
ఖమ్మం జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య
చేసుకున్న ప్రేమికులు హిరణ్మరుు,
సారుుక్రిష్ణ తల్లిదండ్రులు రోదించిన
తీరు అందరినీ కలచి వేసింది..
కరీమాబాద్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్కు చెందిన మాటేటి హిరణ్మయి(19), గుడిమెల్ల సాయిక్రిష్ణ(20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు హైస్కూల్ వరకు కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇష్టపడ్డారు. ఆ తర్వాత మళ్లీ బీటెక్లో ఒకే గ్రూపు, ఒకే క్లాస్ కావడంతో ఆ ప్రేమ అలాగే కొనసాగించారు. హిరణ్మయి తండ్రి రవీందర్ వరంగల్ మున్సిపల్లో కాంట్రాక్టర్గా పనిచేస్తుండగా, తల్లి నీరజ గృహిణి. ఇం కా హిరణ్మయికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అక్క శ్వేత, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అన్నయ్య రాకేష్ ఉన్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న గుడిమెల్ల సాయిక్రిష్ణ ఒకే ఒక్క కుమారుడు కాగా తన తండ్రి ప్రభాకర్ వేరే పెళ్లి చేసుకోవడంతో తల్లి విమలతోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లి హిరణ్మయి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యు లు వెతికినా ఫలితం లేకపోరుుంది. బుధవా రం ఉదయం ఖమ్మం జీఆర్పీ పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డ హిరణ్మయి తండ్రి రవీందర్కు, సాయిక్రిష్ణ తల్లి విమలకు ఫోన్ చేశారు. హిరణ్మయి, సాయిక్రిష్ణలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారనే తెలిపారు. దీం తో ఇరువురి తల్లిదండ్రులు ఒక్కసారి కుప్పకూలారు. చాలా ఏళ్లుగా సాయిక్రిష్ణ, హిరణ్మ యి ప్రేమించుకుంటుండడం.. వారి ప్రేమను తల్లిదండ్రులుఒప్పుకోకపోవడమో..మరేదైనా కారణంతోనో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, మిత్రులు తెలిపారు. కాగా, ప్రేమికుల మృతితో కరీమాబాద్లో విషాద చాయలు అలుముకున్నారుు.
అయ్యో దేవుడా!
Published Thu, Mar 26 2015 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement