‘టీచర్లను నిందించడం సరికాదు’ | 'It is not right to abuser teachers' | Sakshi
Sakshi News home page

‘టీచర్లను నిందించడం సరికాదు’

Dec 9 2017 4:18 AM | Updated on Dec 9 2017 4:18 AM

'It is not right to abuser teachers' - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులను నిందించడం సరికాదని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈమేరకు ఫెడరేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ఎమ్మెస్‌ కిష్టప్ప శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు సరైన పనితీరు కనబర్చకుంటే అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవచ్చని..కానీ అనవసరంగా నిందిస్తూ మానసిక వేదనకు గురిచేయవద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement