'పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తాం' | inister ktr speaks over increment of panchayat employees | Sakshi
Sakshi News home page

'పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తాం'

Feb 2 2016 7:08 PM | Updated on Aug 30 2019 8:24 PM

పంచాయతీ కార్యదర్శులకు త్వరలో పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శులకు త్వరలో పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు పూర్తయినందున ఇకపై పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్‌ఏ) రూపొందించిన నూతన సంవత్సరం డైరీని మంత్రి కేటీఆర్ మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక భూమిక పోషిస్తున్నారని అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement