నిజామాబాద్‌లో భారీ చోరీ ​ | huge robbery in nizamabad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో భారీ చోరీ ​

Jun 23 2017 3:57 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్‌ నగరంలోని హైమద్‌పురా కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ నగరంలోని హైమద్‌పురా కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 100 తులాల బంగారం, రూ. 50 వేల నగదు దోచుకెళ్లారు. ఇంటి యజమాని అబ్దుల్‌ హక్‌ జమీన్‌ ఖతార్‌లో ఉంటాడు. నగరంలో అతని భార్యా, పిల‍్లలు ఉంటారు. గురువారం ఇంట్లో వారంతా బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement