కోదండరాంకు లైన్‌ క్లియర్‌ | Highcourt permission to Telangana Jana Samithi public meeting | Sakshi
Sakshi News home page

కోదండరాంకు లైన్‌ క్లియర్‌

Apr 16 2018 4:21 PM | Updated on Jul 29 2019 2:51 PM

Highcourt permission to Telangana Jana Samithi public meeting - Sakshi

3 రోజుల్లో అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సాక్షి, హైదరాబాద్‌:  ప్రొఫెసర్‌ కోదండరాం స్ధాపించిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఆవిర్భావ సభకు అడ్డంగులు తొలిగాయి. ఈ నెల 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన టీజేఎస్ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అదే విధంగా సభకు 3 రోజుల్లో అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

టీజేఎస్‌ పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో  గతవారం విచారణ చేపట్టిన న్యాయస్ధానం వివరణ ఇవ్వాలని ప్రభుత్వం/పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు టీజేఎస్‌ సభకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై  తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement