సాక్షి, హైదరాబాద్: బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు ఇతర ప్రభుత్వ విభాగాల వైద్యులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇటీవల ప్రభుత్వం విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెం చింది. పెంపు ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. దీంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే అనేక మంది వైద్యులు బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. వారిని బోధనాస్పత్రుల్లో్ల పనిచేసేందుకు అనుమతించాలని వైద్య విద్యా సంచాలకులు.. ప్రజారోగ్య సంచాలకులను కోరినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే పీజీ పూర్తిచేసిన పీహెచ్సీ వైద్యులంతా కూడా బోధనాస్పత్రుల్లో్లకి వెళ్లే అవకాశముంది. కొత్తగా ప్రారంభించబోయే సూర్యాపేట, నల్లగొండ బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు వైద్యులు కావాలి. పైగా ఇతర మెడికల్, బోధనా స్పత్రుల్లోనూ కొరత నివారించే అవకాశముంది.
ఒకేసారి 225 మంది బోధనాస్పత్రులకు...
ఈసారి నుంచి పీజీ పూర్తిచేసిన వారిని తప్పనిసరిగా బోధనాస్పత్రులకు పంపించాలని సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఎందుకంటే ఇన్సర్వీసు కోటాలో పీజీ పూర్తిచేసిన స్పెషలిస్టుల వైద్య సేవలు ఉపయోగించుకోవాలనేది సర్కారు ఉద్దేశం. పైపెచ్చు విరమణ వయసు పెంపుతో అనేకమంది పీజీ చేసిన పీహెచ్సీ వైద్యులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దాదాపు 225 మంది స్పెషలిస్టు వైద్యులు బోధనాస్పత్రుల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇంత పెద్దసంఖ్యలో వైద్యులను బోధనా స్పత్రుల్లోకి పంపితే అక్కడ కొంత కొరత తీరు తుం దని భావిస్తున్నారు. డీఎంఈ వైపు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న స్పెషలిస్టుల వివరాలను పంపించాలని డీఎం హెచ్వోలకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు.
బోధనాస్పత్రులపై ‘ఇతరుల’ ఆసక్తి
Published Sat, Jun 29 2019 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
కబ్జాపర్వం.. దందాలే సర్వం
పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
జగనన్న ఇచ్చిన వరం సొంతిల్లు
మద్యం దుకాణం సిబ్బందిపై కేసు నమోదు
అల్లూరితో మన్యంలో విప్లవ చైతన్యం
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement