హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం | fout High Court judges sworn | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం

Jan 18 2017 4:30 AM | Updated on Aug 31 2018 8:31 PM

హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం - Sakshi

హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ జె. ఉమా దేవి, జస్టిస్‌ ఎన్‌.బాలయోగి, జస్టిస్‌ టి.రజని, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ మంగళవారం ప్రమాణం చేయించారు.

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ జె. ఉమా దేవి, జస్టిస్‌ ఎన్‌.బాలయోగి, జస్టిస్‌ టి.రజని, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ మంగళవారం ప్రమాణం చేయించారు. అనంతరం వీరు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌తో కలసి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌తో కలసి జస్టిస్‌ ఉమాదేవి, జస్టిస్‌ నాగార్జునరెడ్డితో కలసి జస్టిస్‌ రజని, జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌తో కలసి జస్టిస్‌ బాలయోగి కేసులను విచారించారు. కొత్తగా బాధ్య తలు స్వీకరించిన నలుగురు న్యాయమూర్తులకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement