‘కేసీఆర్‌ గాలి మాటలు మానుకోవాలి’ | former home minister sabitha indrareddy takes on cm kcr | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ గాలి మాటలు మానుకోవాలి’

May 26 2017 5:48 PM | Updated on Aug 15 2018 9:30 PM

‘కేసీఆర్‌ గాలి మాటలు మానుకోవాలి’ - Sakshi

‘కేసీఆర్‌ గాలి మాటలు మానుకోవాలి’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాలి మాటలు మానుకోవాలని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాలి మాటలు మానుకోవాలని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి జాతీయ హోదా రాకుండా కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తాము లక్ష కోట్లు ఇచ్చామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఇవ్వలేదని అంటున్నారని, అసలు లెక్కలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు.

ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ అంటున్న కేసీఆర్.. మరి అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అమర వీరుల పునాదులపై టీఆర్‌ఎస్‌ అధికారం చెలాయిస్తోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతుంటే నిరుద్యోగులను కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర కోరుతుంటే రైతులకు బేడీలు వేస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement