'పోచారం.... సభకు క్షమాపణలు చెప్పాలి' | Errabelli dayakar rao takes on trs party on Farmers suicide in telangana | Sakshi
Sakshi News home page

'పోచారం.... సభకు క్షమాపణలు చెప్పాలి'

Nov 7 2014 11:55 AM | Updated on Sep 29 2018 7:10 PM

రైతుల ఆత్మహత్యలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే సభకు క్షమాపణలు చెప్పాలని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే సభకు క్షమాపణలు చెప్పాలని టీటీడీపీ ఎమ్మెల్యే  ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎర్రబెల్లి అసెంబ్లీ సభలో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై చర్చించాలా వద్దా అని అధికార పక్షమైన టీఆర్ఎస్ను ప్రశ్నించారు.

సభలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఉత్తగా లేరని అధికార పార్టీకి వెల్లడించారు. రైతుల సమస్యలపై గళమెత్తిన తమపై ఎదురుదాడి చేస్తే చూస్తు ఊరుకోమని టీఆర్ఎస్కు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement