కోదాడటౌన్ :ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందాలో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. కోదాడ కేంద్రంగా రెండేళ్లుగా జరుగుతున్న ఈ వ్యాపారం నిర్వహిస్తున్న వీరిద్దరు శని వారం హైదరాబాద్లో పట్టుబడ్డారు. నిందితులది అస్సాం రాష్ర్టం కాగా వారిద్దరూ కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చేస్తున్నారు. వారి వద్ద భారీ ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు లభ్యమాయ్య యి. వీరిని నమ్ముకుని అడ్మిషన్ల కోసం కొన్ని ఇంజి నీరింగ్ కళాశాలల నిర్వాహకులు లక్షల రూపాయలు ముట్టజెప్పగా వారికి ముందస్తుగా కొన్ని విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా వీటిలో ఎక్కువగా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తేలడంతో డబ్బులు ముట్టజెప్పిన కళాశాలల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ అనుమతి రాక నానా ఇబ్బందులు పడుతున్న కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇంతలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూడడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతేకాకుండా పోలీస్ ఉన్నతాధికారులు కోదాడపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలను దర్యాప్తు కోసం కోదాడకు పంపారు.
అసలేం జరిగిందంటే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక్క కోదాడలోనే ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు సుమారు 2 వేల మంది ఇం జినీరింగ్, పాలిటెక్నిక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరారు. కొన్ని కన్సల్టెన్సీలు ఉత్తరాది నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడి కళాశాలల్లో చేర్పించాయి. అం దుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 నుంచి రూ.50 వేల వరకు కమిషన్ తీసుకున్నట్లు తెలిసిం ది. మొదట కోదాడకు చెందిన ఓ మైనార్టీ కళాశాల కొంతమంది బీహార్ విద్యార్థులను చేర్చుకుంది. వా రిని అనుసరించి ఇప్పుడు కోదాడలోని మరో నా లుగు కళాశాలలు పాలిటెక్నిక్,ఇంజినీరింగ్లో 2000 విద్యార్థులకు గడిచిన రెండేళ్ల నుంచి అడ్మిషన్లు ఇ చ్చాయి. విద్యార్థుల ఉండటానికి రెండు కళాశాలలు ప్రత్యేక హాస్టళ్లు, తరగతులను నిర్వహిస్తున్నాయి.
భారీగా ఉపకార వేతనాలు
బీహార్, చత్తీగఢ్, అస్సాం రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల వారికి కల్యాణయోజన పథకం కింద కేం ద్రం భారీగా ఉపకార వేతనాలు ఇస్తుంది. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నవారి ఆత్రుతను ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు అదునుగా భావించారు. నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి విద్యార్థులను కళాశాల లకు అంటగట్టి వారి నుంచి కమిషన్ రూపంలో లక్ష ల రూపాయలు కాజేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంజినీరింగ్ అ డ్మిషన్ల కొనుగోలు దందా ఇప్పుడు తెలంగాణ రాష్ర్ట మంతటా విస్తరించింది. గతంలోనూ చాలా మంది నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఇక్కడి కోర్సుల్లో చేరి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీ సుల దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకా శాలున్నాయి.
ఇంజినీరింగ్ అడ్మిషన్ల కొనుగోలు దందా
Published Mon, Nov 3 2014 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement