కేసీఆర్‌ పాలనకు అంతం  తప్పదు: గూడూరు | The End Of KCR Rule Is Wrong: Gudur Narayana Reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలనకు అంతం  తప్పదు: గూడూరు

Dec 2 2018 11:53 AM | Updated on Dec 2 2018 12:02 PM

 The End Of KCR Rule Is Wrong: Gudur Narayana Reddy - Sakshi

టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నాలుగేళ్ల పాటు సాగిన కేసీఆర్‌ అరాచక పాలనకు అంతం తప్పదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్‌ ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వాల్లోని సమస్యలపై సమీక్షించే అధికారం ఉన్నా గవర్నర్‌ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.

గవర్నర్‌ గుడికి కాకుండా ఆసుపత్రులకు వెళితే ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తానన్న కేసీఆర్‌.. ఖల్లాస్‌ చేశారని విమర్శించారు. ప్రజలను వంచించడంలో కేటీఆర్‌ తండ్రిని మించిపోయాడని అభివర్ణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement