కాజీపేట రైల్వేట్రాక్పై మృతదేహం | dead body in kazipet railway station railway track | Sakshi
Sakshi News home page

కాజీపేట రైల్వేట్రాక్పై మృతదేహం

Dec 13 2015 9:49 AM | Updated on Sep 3 2017 1:57 PM

కాజీపేట రైల్వేట్రాక్పై మహిళా మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు.

వరంగల్ : కాజీపేట రైల్వేట్రాక్పై మహిళా మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. అందులోభాగంగా మృతురాలు సుబేదార్కు చెందిన స్వర్ణలతగా గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భర్త మహేందర్ వరకట్న వేధింపుల వల్లే చనిపోయిందంటూ స్వర్ణలత బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement