సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెలో పాల్గొన్న సంగారెడ్డి డిపో ఆర్టీసీ కార్మికులకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది.
మెదక్ : సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెలో పాల్గొన్న సంగారెడ్డి డిపో ఆర్టీసీ కార్మికులకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి చుక్కా రాములు సంగారెడ్డి పట్టణంలోని రహదారి బంగ్లా నుంచి డిపో వరకు పాదయాత్ర చేసి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ప్రజా సంఘాల మద్దతు కూడగట్టి పోరాటం ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.