నాడు వైరం.. నేడు సన్మానం

Congress MLA Jagga Reddy Honors Minister Harish Rao - Sakshi

సాక్షి, సంగారెడ్డి: గురువారం సంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావేశం సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంత్రి హరీశ్‌రావును సన్మానించి అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేశారు. దశాబ్ద కాలానికిపైగా వీరిమధ్య మాటలు లేని విషయం తెలిసిందే. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగ్గారెడ్డి మంత్రి హరీశ్‌రావును కలసి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తాజాగా ఎమ్మెల్యే, హరీశ్‌రావుకు శాలువాకప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించడం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రి హరీశ్‌రావు కూడా చిరునవ్వుతో జగ్గారెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మరోసారి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top