ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ | Chepa Prasadam Programme Starts At Nampally Exhibition Grounds | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ

Jun 8 2019 8:51 PM | Updated on Jun 8 2019 9:03 PM

Chepa Prasadam Programme Starts At Nampally Exhibition Grounds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన జనాలతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ కిక్కిరిసిపోయింది. చేప ప్రసాదం కోసం ఈ రోజు 32 వేల చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ రేపు సాయంత్రం వరకూ మరో 1.28 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. 32 కేంద్రాల ద్వారా చేప ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement