వ్యాపారుల ట్రేడ్ లైసెన్సుల రద్దుకు సర్కారు యోచన
ప్రభుత్వ ధరలకే పంటలు అమ్ముకునేలా చట్టం?
ఖమ్మంలో మిర్చి రైతు దగాపై నివేదిక కోరిన సీఎం
సాక్షి, హైదరాబాద్: రైతుకు గిట్టుబాటు ధర రాకుండా అడుగడుగునా దోపిడీ చేస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అవసరమైతే బాధ్యులైన వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో తీసుకురాబోయే మార్కెటింగ్ చట్టంలో కొత్త అంశాలు జోడించాలని భావిస్తోంది. ఇప్పటికే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన చట్టంలో అదనంగా కొత్త అంశాలు జోడించి పకడ్బందీగా తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది నుంచి గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మార్కెటింగ్ చట్టం ఆ మేరకు రైతుకు ఉపయోగపడేలా ఉండాలని తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్కెటింగ్ చట్టం ప్రకారం గ్రామ, మండల, జిల్లా రైతు సంఘాలు కలసి ఇతర ప్రాంతాల్లో పంటను విక్రయించి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి.
ఎక్కడా ధర లేకపోతే గోదాముల్లో నిల్వ ఉంచి ధర వచ్చాకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఇటువంటి భూమిక ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరోవైపు నకిలీ విత్తన నిరోధక, పరిహార చట్టాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు సిద్ధమైంది. కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్మితే సంబంధిత యజమానిని జైలుకు పంపిస్తారు. రైతుకు కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తారు. ఈ బిల్లును ఇప్పటికే న్యాయశాఖ పరిశీలనకు పంపించారు. కేబినెట్ ఆమోదం తర్వాత శాసనసభలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది.
అకస్మాత్తుగా ధర ఎందుకు తగ్గింది?
కొద్ది రోజులుగా రూ. 6 వేల దాకా క్వింటాల్ మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు...శుక్రవారం ఖమ్మంలో అకస్మాత్తుగా 50–60 శాతం మధ్య ధరలు తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్లో మిర్చిని రూ.2,500 నుంచి రూ.4,500 వరకే కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. దళారుల ప్రమేయంపైఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసం వెనుక ఉన్న వారి వివరాలు తెలుసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీ పథకం ప్రకారం రైతులను రెచ్చగొట్టడం వల్లే విధ్వంసం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే తక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులను కట్టడి చేయడంలో విఫలమైన మార్కెటింగ్ అధికారులపై మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మిర్చి రైతుల హాహాకారాలు...
ఊహించని రీతిలో మిర్చి ధర పడిపోవడంతో రైతులు హహకారాలు పెడుతున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు సగటున రూ. 4,500 ధర మించడం లేదు. నాణ్యత లేదంటూ కొన్నిచోట్ల రూ. 3 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. తక్కువ ధరపై రైతులు ప్రశ్నిస్తే కొనుగోలు చేయకుండా వ్యాపారులు సతాయిస్తున్నారు. వాస్తవంగా సీజన్ ప్రారంభంలో మిర్చి ధర కొంతలో కొంత బాగుంది. జనవరి నుంచి ధర పతనం మొదలైంది. ఫిబ్రవరిలో దాదాపు రూ. 1,500 తగ్గింది. ఇక పంట ఉత్పత్తి అధికంగా ఉండే మార్చి, ఏప్రిల్లలో అనూహ్యంగా ధర పతనమైంది. గత నెల మొదట్లో రూ. 8 వేలకు పడిపోయింది. మార్చి రెండో వారం నుంచి రూ. 5 వేలకు పడిపోయింది. ఇప్పుడు రూ. 4,500కు పడిపోయింది.
ప్రస్తుతం రోజుకు కొంత చొప్పున ధర పడిపోతోంది. రైతుకు ఎకరా పంట సాగు కోసం కోతకు రూ. లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ధరల పతనంతో మిర్చి రైతులు హాహాకారాలు చేస్తున్నారు. కొన్ని మార్కెట్లలో మిర్చిని కాలబెడుతున్నారు. ఇంత జరుగుతున్నా మిర్చి కొనుగోలుకు అనుమతిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి లేఖ రాసినా ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీకి వెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మిర్చి రైతులకు క్వింటాలుకు రూ. 1,500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం తెలిసిందే.
రైతును దగా చేస్తే.. లైసెన్స్ రద్దు!
Published Sat, Apr 29 2017 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement