జలరవాణా కోసం వంతెనలు | bridges for Water transport | Sakshi
Sakshi News home page

జలరవాణా కోసం వంతెనలు

Mar 10 2016 3:42 AM | Updated on Sep 3 2017 7:21 PM

జలరవాణా కోసం వంతెనలు

జలరవాణా కోసం వంతెనలు

గోదావరి, కృష్ణానదుల్లో జలరవాణాకు అనువుగా కొత్త వంతెనల నిర్మాణాలకుగాను డిజైన్లు సిద్ధమయ్యాయి.

రెండు పడవలు వెళ్లేలా మార్గం
ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల చర్చ

 సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణానదుల్లో జలరవాణాకు అనువుగా కొత్త వంతెనల నిర్మాణాలకుగాను డిజైన్లు సిద్ధమయ్యాయి. రెండు పడవలు వెళ్లగలిగేలా మార్గాన్ని వదలిపెట్టి కొత్త వంతెనలను నిర్మించేలా నమూనాలను అధికారులు సిద్ధం చేశారు. రెండువైపులా ఒకేసారి రెండు పడవలు వెళ్లేందుకు వీలుగా 70-80 మీటర్ల వెడల్పు, 40-50 మీటర్ల ఎత్తుతో ఈ మార్గం ఉంటుంది. భవిష్యత్తులో రెండు నదులపై నిర్మించే అన్ని వంతెనలకు ఇదే నమూనా సిద్ధం చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయ న సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీ-ప్లస్ వన్ పద్ధతిలో వాటి నమూనాను అధికారులు రూపొందించారు.

ఒక్కో ఇంటికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాల్సి ఉన్నం దున స్థలసేకరణ, ఇతరత్రా అనుమతులకు కసరత్తు ప్రారంభించాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మను మంత్రి ఆదేశించారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 1400 కి.మీ. జాతీయ రహదారులకు సంబంధించి వెంటనే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలన్నారు. జిల్లా కేంద్రాలు-మండల కేం ద్రాల అనుసంధాన రహదారుల నిర్మాణ పనులన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రోడ్లు, భవనాల శాఖలోని అన్ని ఖాళీలు, పదోన్నతుల భర్తీపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రోడ్ల విభాగం ఈఎన్‌సీ రవీందర్‌రావు, జాతీయ రహదారులు, భవనాల ఈఎన్‌సీ గణపతి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement