దారుణం: ఆటోలో కరోనా రోగి మృతదేహం | Body Of The Man Who Died With Covid Was Moved In Auto | Sakshi
Sakshi News home page

ఆటోలో కరోనా రోగి మృతదేహం తరలింపు

Jul 11 2020 3:26 PM | Updated on Jul 11 2020 7:52 PM

Body Of The Man Who Died With Covid Was Moved In Auto - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. నిబంధనలు ప్రకారం కరోనా వైరస్ ద్వారా మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు  ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మాత్రం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆటోలో కరోనా  రోగి మృతదేహాన్ని స్మశాన వాటిక కు తరలించారు. డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా  పీపీఈ  కిట్లు ధరించలేదు. ఎలాంటి  కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్‌ అందుబాటులో ఉందని, అందువల్ల ఆటోలో తరలించామని ప్రభుత్వాసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement