నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్.. కుదిరిన పొత్తు..! | Congress on the Nizamabad Mayor seat | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్.. కుదిరిన పొత్తు..!

Feb 15 2026 6:06 PM | Updated on Feb 15 2026 6:21 PM

Congress on the Nizamabad Mayor seat

 సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది.  కాంగ్రెస్‌కు మేయర్ పదవి, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి షేర్ చేసుకునేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు  కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. నగరపాలక సంస్థకు మెుత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్‌కు ఒక స్థానం లభించింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

అయితే ఏ పార్టీకి కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ సీట్లు రాకపోవడంతో నిజామాబాద్‌లో హంగ్‌ ఏర్పడింది. దీంతో ఇందూరులో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. బీజేపీ  అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ మేయర్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్ పావులు కదిపింది. అయితే కాంగ్రెస్ మేయర్‌ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకిలోనే మరికొందరు మేయర్‌ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్‌ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్‌ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్‌ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్‌ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్‌ నుంచి గెలిచిన కేతావత్‌ సురేఖలు మేయర్‌ రేసులో ఉన్నారు. 

మొత్తం ఐదుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నాట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇక్కడ హంగ్ వచ్చింది.  ఈ కార్పొరేషన్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఎక్స్‌ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్‌కు రెండు ఓట్లు పెరిగినట్‌లైంది. బీఆర్‌ఎస్‌ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్‌–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేయర్ పీఠం చేజిక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement