బీజేపీ నాయకుల సంబరాలు | BJP leaders celebrations on elections results | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకుల సంబరాలు

Oct 20 2014 2:20 AM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ నాయకుల సంబరాలు - Sakshi

బీజేపీ నాయకుల సంబరాలు

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందడంతో ఆ పార్టీ స్థానిక నాయకులు సంబరాలు నిర్వహించారు.

నిర్మల్ అర్బన్ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందడంతో ఆ పార్టీ స్థానిక నాయకులు సంబరాలు నిర్వహించారు. నిర్మల్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద ఆదివారం టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టా రు. ప్రాంతాలకు, పార్టీలకతీతంగా ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే మహారా ష్ట్ర, హర్యానాలో విజయం సాధించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య పేర్కొన్నారు. ప్రజలకు మోదీ పట్ల ఉన్న విశ్వాసానికి ఈ ఎన్నికలు ప్రతీకగా నిలిచాయని తెలిపారు. మోదీ హయాంలోనే ఐదుసార్లు డీజిల్ ధరలు తగ్గాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒడిసెల శ్రీనివాస్, నాయకులు రాజేందర్‌రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్, నాయిడి మురళి, మెడిసెమ్మ రాజు, నాళం నరేందర్, అయిండ్ల పోశెట్టి, శశిరాజ్‌వర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement