రోడ్డు ప్రమాదంలో బెంగళూరువాసి మృతి | Bangalore resident died in road accident at NH road high way | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బెంగళూరువాసి మృతి

Jan 26 2015 11:24 PM | Updated on Sep 2 2017 8:18 PM

రోడ్డుప్రమాదంలో కారు బోల్తాపడి ఒక మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.

మానోపాడు(మహబూబ్‌నగర్): రోడ్డుప్రమాదంలో కారు బోల్తాపడి ఒక మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా మనోపాడ్ మండలం ఎన్‌హెచ్ 44పై సోమవారం రాత్రి 9.45 గంటలకు జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన బెంగళూరు వాసులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా కారు బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న లక్షి(55) అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement