గోషామహల్‌లో నిరుపయోగ వస్తువుల వేలం

Auction Of Goods At Goshamahal Police Stadium - Sakshi

ఉదయం 11 గంటల నుంచి వేలం ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ పోలీసు విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్న, ప్రస్తుతం నిరుపయోగ స్థితిలో ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రహదారి, ఫుట్‌పాత్‌లకు అడ్డంగా ఏర్పాటు చేసిన తోపుడు బళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని గోషామహల్‌ పోలీస్‌ స్టేడియాని తరలించారు. ఆయా వస్తువులను కొనుగోలు చేయాలని చేయాలని భావించే వారు మంగళవారం ఉదయం 11 గంటలకు గోషామహల్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top