తూర్పుగోదావరి జిల్లాలో గురుకుల కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
విద్యార్థిని అనుమానాస్పద మృతి
Oct 27 2016 12:59 PM | Updated on Nov 9 2018 5:02 PM
రాజోలు: తూర్పుగోదావరి జిల్లాలో గురుకుల కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజోలు మండలం శివకోడు గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న గోడా రాణి(16) అనే విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందింది. గోడారాణి మృతిపై అనుమానాలు రేకెత్తడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని స్వస్థలం అమలాపురం మండలం భట్నవిల్లి.
Advertisement
Advertisement