రాయబారి సెల్ఫీ తీసుకుంటుంటే దొంగ షాక్‌

రాయబారి సెల్ఫీ తీసుకుంటుంటే దొంగ షాక్‌


న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద స్వీయ చిత్రాలను (సెల్ఫీలను) తీసుకుంటున్న ఓ రాయబారికి ఓ దొంగ షాకిచ్చాడు. చాలా తేలికగా ఆయన ఫోన్‌ను ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఆయన ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర హోంశాఖకు, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇగోర్‌ పోలిఖా అనే ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తి గత ఏడాదే భారత్‌కు రాయబారిగా నియమితులయ్యారు.



ఆయన ఎర్రకోట చూసేందుకు వెళ్లిన సందర్భంలో సెల్ఫీలు తీసుకుంటుండగా అటుగా వచ్చిన ఓ దొంగ ఫోన్‌ ఎత్తుకొని పారిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరంట. ఉదయం 9.15గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని, ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలింపులు చేస్తున్నామని తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top