సిరిసిల్లను జిల్లాగా వెంటనే ప్రకటించాలంటూ ఆందోళనలు ముమ్మరమయ్యాయి.
‘టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేయాలి’
Sep 8 2016 3:02 PM | Updated on Sep 4 2017 12:41 PM
సిరిసిల్ల: సిరిసిల్లను జిల్లాగా వెంటనే ప్రకటించాలంటూ ఆందోళనలు ముమ్మరమయ్యాయి. టీఆర్ఎస్ నేతలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలంటూ గురువారం జిల్లా సాధన సమితి నేతలు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ ఇంటిని ముట్టడించారు. అనంతరం స్థానిక మహాకాళి ఆలయం వద్దకు బోనాలతో తరలివెళ్లారు. కాగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పినట్లు సమాచారం రావడంతో ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి.
Advertisement
Advertisement