మిర్చి@ రూ. 17,500 | Mirchi @ Rs. 17,500 | Sakshi
Sakshi News home page

మిర్చి@ రూ. 17,500

Feb 22 2017 3:47 AM | Updated on Oct 1 2018 2:09 PM

మిర్చి@ రూ. 17,500 - Sakshi

మిర్చి@ రూ. 17,500

మిర్చికి ధర తగ్గిందని రైతులు ఆం దోళన చెందుతున్న క్రమంలో మంగళవారం వరంగల్‌ మార్కెట్‌లో

వరంగల్‌ సిటీ: మిర్చికి ధర తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో మంగళవారం వరంగల్‌ మార్కెట్‌లో సింగిల్‌ పట్టి రకం మిర్చికి రికార్డుస్థాయిలో ధర పలికింది. ఈ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 17,500 ధర పలికింది. గతేడాది సింగిల్‌పట్టి రకం మిర్చికి అత్యధికంగా రూ. 16,500 ధర పలికింది.

మంగళ వారం పరకాలకు చెందిన రవీందర్‌ మొదటిసారి 7 బస్తాల నాణ్యమైన సింగిల్‌ పట్టి రకం మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా ఈ ధర పలికింది. దేశీ రకం మిర్చి కూడా మొదటిసారి క్వింటాల్‌కు రూ.14,500, 13,500 ధర పలికింది. ఇదే దేశీ రకం మిర్చికి గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.18,001 రికార్డు ధర పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement