ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌ | minister ktr participates in india today summit | Sakshi
Sakshi News home page

ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌

Jan 10 2017 8:07 PM | Updated on Aug 30 2019 8:24 PM

ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌ - Sakshi

ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌

పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌ అత్యంత ఆకర్షణీయ ప్రదేశమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

చెన్నై: పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌ అత్యంత ఆకర్షణీయ ప్రదేశమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఇండియా టుడే సదస్సులో ఆయన పాల్గొన్నారు. టీఎస్‌ ఐపాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తొలిస్థానం రావడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

చెన్నైలో కేటీఆర్‌ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. టీవీఎస్‌, మురుగప్ప, ఎంఆర్ఎఫ్‌, రానే ఇంజనీరింగ్‌ సంస్థల ప్రతినిధులను కలిశారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులపై వారితో చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement