చెత్తకుప్పలో శిశువు మృతదేహం | female baby dead body found in ranga reddy district | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో శిశువు మృతదేహం

Sep 11 2016 4:28 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు. ఈ సంఘటన వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం జరిగింది. పందులు, కుక్కలు పసికందు శవాన్ని పీక్కు తింటుంటే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement