ఆటో బోల్తా: 10 మందికి గాయాలు
బయ్యారం: ఖమ్మం జిల్లా బయ్యారం శివారులోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఉదయం ఆటో బోల్తాపడి పది మంది గాయపడ్డారు. బయ్యారం మండలం వినోభానగర్ నుంచి పెన్షన్ తీసుకునేందుకు మండల కేంద్రానికి ఆటోలో వస్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.