రాణించిన రాహుల్, కోహ్లి | WICB Pres XI v/s India: Kohli, Rahul bat with ease to dominate the hosts on Day 2 | Sakshi
Sakshi News home page

రాణించిన రాహుల్, కోహ్లి

Jul 16 2016 12:09 AM | Updated on Sep 4 2017 4:56 AM

వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ మెరుగ్గా ఆడుతోంది...

భారత్ తొలి ఇన్నింగ్స్ 239/6
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ మెరుగ్గా ఆడుతోంది. కేఎల్ రాహుల్ (127 బంతుల్లో 64 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు; 1 సిక్స్) తన ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో రెండో రోజు ఆటలో కడపటి వార్తలందే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో ఆరు వికెట్లకు 239 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (94 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు.

రహానే (24 బ్యాటింగ్), సాహా (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు విండీస్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement