తెలంగాణ జట్టుకు స్వర్ణం

సాక్షి, సిటీబ్యూరో: జాతీయ మినీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు స్వర్ణ పతకం లభించింది. అమరావతిలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌–9 కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జయదేవ్, శారవ్‌ కుమార్, తనీష్, రిషికేశ్‌లతో కూడిన తెలంగాణ జట్టు 1623–1503తో ఢిల్లీ జట్టును ఓడించింది. వ్యక్తిగత విభాగంలోనూ జయదేవ్‌ (10 మీటర్లు, 15 మీటర్లు) రెండు స్వర్ణాలు గెలుపొందడం విశేషం. ఈ సందర్భంగా పతకాలు నెగ్గిన చిన్నారులను తెలంగాణ ఆర్చరీ సంఘం సెక్రటరీ ఇ.సంజీవ రెడ్డి, హైదరాబాద్‌ ఆర్చరీ సంఘం సెక్రటరీ అరవింద్‌ కుమార్, కోచ్‌ అరుణ్‌ కుమార్, మేనేజర్‌ నందకిశోర్‌ అభినందించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top