తెలంగాణ జట్టుకు స్వర్ణం | Telangana team got gold medal in mini national archery championship | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్టుకు స్వర్ణం

Oct 28 2017 10:59 AM | Updated on Oct 28 2017 10:59 AM

సాక్షి, సిటీబ్యూరో: జాతీయ మినీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు స్వర్ణ పతకం లభించింది. అమరావతిలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌–9 కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జయదేవ్, శారవ్‌ కుమార్, తనీష్, రిషికేశ్‌లతో కూడిన తెలంగాణ జట్టు 1623–1503తో ఢిల్లీ జట్టును ఓడించింది. వ్యక్తిగత విభాగంలోనూ జయదేవ్‌ (10 మీటర్లు, 15 మీటర్లు) రెండు స్వర్ణాలు గెలుపొందడం విశేషం. ఈ సందర్భంగా పతకాలు నెగ్గిన చిన్నారులను తెలంగాణ ఆర్చరీ సంఘం సెక్రటరీ ఇ.సంజీవ రెడ్డి, హైదరాబాద్‌ ఆర్చరీ సంఘం సెక్రటరీ అరవింద్‌ కుమార్, కోచ్‌ అరుణ్‌ కుమార్, మేనేజర్‌ నందకిశోర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement