సమరానికి సఫారీలు వచ్చేశారు... | South African cricket team came to india | Sakshi
Sakshi News home page

సమరానికి సఫారీలు వచ్చేశారు...

Sep 28 2015 12:00 AM | Updated on Sep 3 2017 10:05 AM

సమరానికి సఫారీలు వచ్చేశారు...

సమరానికి సఫారీలు వచ్చేశారు...

మూడు ఫార్మాట్‌లలో 72 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లోకి అడుగు పెట్టింది.

మూడు ఫార్మాట్‌లలో 72 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లోకి అడుగు పెట్టింది. ఆటగాళ్లంతా ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా  భారత్‌తో 3 టి20లు, 5 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా తలపడుతుంది.

ఈ నెల 29న సఫారీలు ఢిల్లీలో టి20 వార్మప్ మ్యాచ్ ఆడనుండగా... అక్టోబర్ 2న ధర్మశాలలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు డివిలియర్స్, టి20 జట్టుకు డు ప్లెసిస్, టెస్టు జట్టుకు ఆమ్లా సారథ్యం వహించనున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement