‘పారదర్శకంగా ఉండాల్సిందే’ | should be tranparent | Sakshi
Sakshi News home page

‘పారదర్శకంగా ఉండాల్సిందే’

Mar 3 2015 12:49 AM | Updated on Sep 2 2017 10:11 PM

దేశంలోని క్రీడా వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండేందుకు కేంద్ర క్రీడా శాఖ నడుం బిగించింది.

న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండేందుకు కేంద్ర క్రీడా శాఖ నడుం బిగించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)ల కార్యకలాపాలను, ఆర్థిక వ్యవహారాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ఈ సూచనలు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్-2011లో భాగమేనని ఐఓఏ, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు రాసిన లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీలోగా అన్ని సమాఖ్యల వెబ్‌సైట్లలో వారి పూర్తి వివరాలు ఉంచాల్సిందేనని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement