
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగి, అంతర్జాతీయ అంపైర్ డి. అజయ్ కుమార్కు గొప్ప అవకాశం దక్కింది. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో అజయ్ కుమార్ అంపైర్గా విధులు నిర్వర్తించనున్నారు. కటక్లోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 17 నుంచి 22 వరకు కామన్వెల్త్ టీటీ చాంపియన్షిప్ జరుగుతుంది.