ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్‌  | Saina Nehwal pulls out of India Open | Sakshi
Sakshi News home page

ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్‌ 

Mar 21 2019 12:21 AM | Updated on Mar 21 2019 12:21 AM

Saina Nehwal pulls out of India Open - Sakshi

న్యూఢిల్లీ వేదికగా ఈనెల 26 నుంచి జరిగే ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ వైదొలిగింది. కడుపు నొప్పి నుంచి తాను ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)కు సైనా సమాచారం ఇచ్చింది.

2015లో ఇండియా ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన సైనా వైదొలగడంతో... మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో ప్రస్తుతం భారత్‌ నుంచి పీవీ సింధు మాత్రమే బరిలో ఉంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement