రామ్‌కుమార్‌ శుభారంభం | Ramkumar started well | Sakshi
Sakshi News home page

రామ్‌కుమార్‌ శుభారంభం

Jun 15 2017 11:52 PM | Updated on Sep 5 2017 1:42 PM

రామ్‌కుమార్‌ శుభారంభం

రామ్‌కుమార్‌ శుభారంభం

ఇటలీలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ ముందంజవేశాడు.

రోమ్‌: ఇటలీలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ ముందంజవేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో రామ్‌కుమార్‌ 6–2, 4–6, 7–6తో సెబాస్టియన్‌ ఓఫ్నెర్‌ (ఆస్ట్రియా)పై చెమటోడ్చి విజయం సాధించాడు. రెండోరౌండ్‌లో ప్రపంచ 126వ ర్యాంకర్, మిఖాయిల్‌ కుకుష్కిన్‌ (కజకిస్తాన్‌)తో రామ్‌కుమార్‌ తలపడనున్నాడు.

మరోవైపు పోర్చుగల్‌లోని లిస్బన్‌లో జరుగుతున్న మరో ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ ప్రజ్ఞేశ్‌ గుణ్నీశ్వరన్‌ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. జావో డొమింగోస్‌ జరిగిన మ్యాచ్‌లో 5–7, 4–6తో ప్రజ్ఞేశ్‌ పరాజయం పాలయ్యాడు. 

Advertisement
 
Advertisement
Advertisement