కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం | gutta Jwala and Ashwini pair lose as Indian challenge ends | Sakshi
Sakshi News home page

కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం

Jan 9 2014 8:45 PM | Updated on Sep 2 2017 2:26 AM

కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం

కొరియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం

కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది.

సియోల్: కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ పోరాటం ముగిసింది. డబుల్స్ విభాగంలో గురువారం జరిగిన రెండో రౌండ్ లో భారత్ షట్లర్లు గుత్తా జ్వాల-అశ్విన్ పొన్నప్ప జోడీలకు పరాభవం ఎదురుకావడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించారు. యా నా జాంగ్, యంగ్ కిమ్ ల జోడీ చేతిలో 21-18,21-12 తేడాతో జ్వాల-అశ్వినిలు ఓటమి పాలైయ్యారు. మరోప్రక్క మిక్సిడ్ డబుల్స్ లో తరుణ్- కోనా జంట 10-21, 15-21 తేడాతో జర్మనీ జంట మైఖేల్ ఫక్స్, బిర్జిట్ మైఖేల్స్ చేతిలో చుక్కెదురైంది.

 

వీరి ఓటమితో భారత్ పోరు ఆదిలోనే ముగిసినట్టయ్యింది. ముందురోజు మహిళల విభాగంలో మెరుపించి రెండో రౌండ్ కు చేరుకున్నగుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి ఈ గేమ్ లో కనీసం పోరాట పటిమను కూడా కనబరచకుండా ఓటమి చెందారు.  అయితే పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement