బ్రిస్బేన్: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగించింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ముందు 561 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (154 బంతుల్లో 124; 13 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ మైకేల్ క్లార్క్ (130 బంతుల్లో 113; 9 ఫోర్లు; 1 సిక్స్) శతకాలతో హోరెత్తించడంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్లో 94 ఓవర్లలో 7 వికెట్లకు 401 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
వార్నర్కు ఇది తొలి యాషెస్ టెస్టు సెంచరీ కాగా ఓవరాల్గా మూడోది. అటు క్లార్క్ కెరీర్లో 25వ శతకాన్ని అందుకున్నాడు. వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ (55 బంతుల్లో 53; 5 ఫోర్లు), మిచెల్ జాన్సన్ (45 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) మరోసారి రాణించారు. దీంతో ఇంగ్లండ్పై 560 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించినట్టయ్యింది. ట్రెమ్లెట్కు మూడు, బ్రాడ్, స్వాన్కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 561 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 24/2 స్కోరుతో ఉంది.
క్రీజులో కెప్టెన్ కుక్ (50 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్), పీటర్సన్ (3 బ్యాటింగ్) ఉన్నారు. మ్యాచ్కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో ఐదు టెస్టుల ఈ సిరీస్లో ఆసీస్ తొలి మ్యాచ్ను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పర్యాటక జట్టు అసాధారణ ఆటతీరును కనబరిస్తే మాత్రం ప్రపంచ రికార్డును సృష్టించినట్టవుతుంది. ఇప్పటిదాకా 2003లో ఆసీస్పైనే 418 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఛేదించి విజయం సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 295; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 136; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 401/7 డిక్లేర్డ్ (94 ఓవర్లలో) (వార్నర్ 124, క్లార్క్ 113, హాడిన్ 53, బెయిలీ 34, మిచెల్ జాన్సన్ 39 నాటౌట్, ట్రెమ్లెట్ 3/69, బ్రాడ్ 2/55) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 24/2 (కుక్ 11 బ్యాటింగ్, పీటర్సన్ 3 బ్యాటింగ్).
ఇంగ్లండ్ లక్ష్యం 561
Published Sun, Nov 24 2013 1:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement