
సిడ్నీ ఆనవాయితీ మారింది
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆనవాయితీ మారింది. టీమిండియాకు తీవ్ర నిరాశ ఎదురైంది.
సిడ్నీ: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆనవాయితీ మారింది. టీమిండియాకు తీవ్ర నిరాశ ఎదురైంది. సిడ్నీలో 2011 నుంచి 9 వన్డేలు జరగ్గా, ఛేజింగ్ చేసిన జట్లే నెగ్గాయి. ఈ సారీ ఇదే ఆనవాయితీ కొనసాగుతుందని ఆశించిన టీమిండియా అభిమానులకు నిరాశ ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీసే నెగ్గింది. గురువారం జరిగిన ప్రపంచ కప్ సెమీస్లో ఆతిథ్య ఆస్ట్రేలియా.. భారత్పై విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. భారీ ఛేజింగ్లో ధోనీసేన బోల్తాపడింది. ప్రపంచ కప్ చరిత్రలో సెమీస్లో ఓటమెరుగని చరిత్ర గల ఆసీస్ ఏడోసారి ఫైనల్కు దూసుకెళ్లగా.. తాజా ఈవెంట్లో ఓటమెరుగని టీమిండియా టైటిల్ రేసు నుంచి నిష్ర్కమించింది.