వియత్నాం ఓపెన్‌ టోర్నీ సెమీస్‌లో అజయ్‌ జయరామ్‌ | Ajay Jayaram in the Vietnam Open tournament semis | Sakshi
Sakshi News home page

వియత్నాం ఓపెన్‌ టోర్నీ సెమీస్‌లో అజయ్‌ జయరామ్‌

Aug 11 2018 1:37 AM | Updated on Aug 11 2018 1:37 AM

Ajay Jayaram in the Vietnam Open tournament semis - Sakshi

తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి షట్లర్‌ అజయ్‌ జయరామ్‌ వియత్నాం ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జయరామ్‌తోపాటు భారత్‌కే చెందిన మరో యువ ఆటగాడు మిథున్‌ మంజునాథ్‌ కూడా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో జయరామ్‌ 26–24, 21–17తో జియోడాంగ్‌ షెంగ్‌ (కెనడా)పై గెలుపొందగా... మిథున్‌ 17–21, 21–19, 21–11తో జెకి జౌ (చైనా)ను ఓడించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement