‘పసుపు కుంకుమ’తో చంద్రబాబు మోసం

YSRCP Leader Akepati Amarnath Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, రాజంపేట : వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్న సీఎం చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు  ఆకెపాటి అమర్‌నాథ్‌ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎన్నో బూటకపు హామీలిచ్చిన చంద్రబాబు.. నాలుగున్నరేళ్ల తర్వాత ‘పసుపు కుంకుమ’ తో మరోసారి మోసం చేయడానికి వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చే గురువారం (ఫిబ్రవరి 7) కడప మున్సిపల్‌ స్టేడియంలో బూత్‌ కమిటీలతో సమావేశంలో ఉంటుందని తెలిపారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, శ్రీనివాసులు,  కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేస్‌బాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

దేశంలోనే ఏపీని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఒక్క వైఎస్‌ జగన్‌కే సాధ్యమని సురేష్‌బాబు అన్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో బాబుకు బీసీలు, మహిళలు, దళితులు కనిపిస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ఇచ్చే హామీల అమలుకు అమెరికా బడ్జెట్‌ కూడా సరిపోదవి వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు నవరత్నాలకు కాపీ కొడతున్నారని ఫైర్‌ అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top