179వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర  | YS Jagan Prajasankalpayatra 179Th Day Starts | Sakshi
Sakshi News home page

179వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 

Jun 3 2018 8:20 AM | Updated on Jul 26 2018 7:14 PM

YS Jagan Prajasankalpayatra 179Th Day Starts - Sakshi

మంగళహారతులతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న మహిళలు

సాక్షి, ఆచంట : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం జగన్నాధపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు, వెలగలేరు క్రాస్‌, సత్యవరం క్రాస్‌, నెగ్గిపూడి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. పెనుగొండ చేరుకుని అక్కడ ప్రజలతో వైఎస్‌ జగన్‌ మమేకంకానున్నారు. పెనుగొండ బహిరంగ సభలో ప్రజలను  ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజాసమస్యలు తెలుసుకంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement