సర్‘కారు’ గుర్తుండేలా..
సిరిసిల్ల: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కారు గుర్తు ఓటర్ల మదిలో గుర్తుండిపోయేలా చేశారు పార్టీ అభిమాని ఒకరు. సిరిసిల్ల ఎంపీపీ జూపల్లి శ్రీలత భర్త శ్రీనివాస్రావు తన పాత కారుకు గులాబీ రంగు వేయించి గద్దె కట్టి రోడ్డు పక్కన నిలిపారు. సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనే శ్రీనివాస్రావు తన సొంత భూమిలో ఇలా కారును ఉంచగా పలువురు ఆసక్తిగా చూస్తున్నారు.